Saturday, October 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గంజాయి ముఠా అరెస్ట్

గంజాయి ముఠా అరెస్ట్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం: గంజాయి సేవిస్తున్న ఆరుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కాటారం పోలీసులు వెల్లడించారు. వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయి,4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం గారి పల్లి గ్రామానికి చెందిన 1)జాడీ వివేక్, 2) ఆకుల అఖిల్,3) జాడి గణేష్,4) దయాకి శ్రీకాంత్,5) సయ్యద్ అస్లాం, 6)కాటారం గ్రామానికి చెందిన గంట పరిపూర్ణం అనే ఆరుగురు యువకులు బయ్యారం గ్రామ సమీపంలో అనుమానాస్పదంగా కనిపించారని, పోలీసులను చూసి పారిపోయే క్రమంలో వారిని పట్టుకుని విచారించడంతో గంజాయి సేవిస్తున్నట్టు, అంతేకాకుండా గంజాయి విక్రయిస్తున్నట్టు ఒప్పుకోవడంతో వారి వద్ద నుండి 900 గ్రాముల గంజాయి,4 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించడం జరిగిందని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -