- Advertisement -
నవతెలంగాణ – కమ్మర్ పల్లి : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి సీతక్కను కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య కలిశారు. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన మంత్రిని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా నియమితులైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య మంత్రి సీతక్కకు పుష్పగుచ్చం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు.
- Advertisement -