నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లాడేగాం గ్రామంలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన గృహ నిర్మాణాలను శుక్రవారం జుక్కల్ ఎంపీఓ రాము మార్కోటి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ ఓ రాము మాట్లాడుతూ.. స్థానిక ప్రజాప్రతిని ధులు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్ యువ నాయకుడుతో కలిసి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలకు మార్కోటి ఇవ్వడం జరిగింది. గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో నిర్మాణాలు చేస్తున్న లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పరిస్థితిని పరిశీలించారు. సమస్యలుంటే తమ ముందే చెప్పాలని నిర్మాణాలు త్వరగా పూర్తిచేస్తే వెంటనే బిల్లులు మీ యొక్క ఖాతా లో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఓ రాముతో పాటు జిపి కార్యదర్శి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ పటేల్, గృహ నిర్మాణ లబ్ధిదారులు , గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
లాడేగామ్ లో ఇందిరమ్మ గృహాలకు మార్కింగ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES