సామూహిక అక్షరాభ్యాసం..

నవతెలంగాణ – గోవిందరావుపేట

మండలంలోని పస్రా గ్రామంలో అభ్యుదయ కాలనీ పిఎస్ లో గిరిజన కాలనీ అంగన్వాడి సెంటర్ లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఎంపీపీ సూడి శ్రీనివాస్ రెడ్డి హాజరై నిర్వహించారు. జెడ్ పి హెచ్ ఎస్ ఎం శ్రీనివాస్  పీఎస్ హెచ్ఎం సమ్మిరెడ్డి  మరియు నర్సింగరావు సారు మరియు గిరిజన కాలనీ అంగన్వాడీ టీచర్  పద్మావతి అంగన్వాడీ టీచర్లు అందరూ పాల్గొని సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది ప్రతి అంగన్వాడి సెంటర్లో మూడు నుంచి 6 సంవత్సరాల పిల్లలకు అక్షరాభ్యాసము ఐదు నుంచి 14 సంవత్సరాలు పిఎస్ లలో జెడ్పీఎస్ఎస్ లో ఉండాలని బడి బయట ఎవరు ఉండకూడదని ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ స్కూల్లో చదువు నేర్చుకోవాలని విద్య యొక్క ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది పసర ఫోర్ అంగన్వాడీ టీచర్ పద్మారాణి అభ్యుదయ కాలనీ పి సరిత వడ్డెర గూడెం భాగ్యమ్మ ముద్దులగూడెం పి రజిత సునీత గిరిజన కాలనీ ఆయా రాధిక ఆశా వర్కర్ సుభద్ర వీరందరూ పాల్గొన్నారు.

Spread the love