నవతెలంగాణ-రామారెడ్డి : మండలంలోని కన్నాపూర్ తండాలోని మండల పరిషత్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని మండల విద్యాశాఖ అధికారి ఆనందరావు సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ., ప్రభుత్వ పాఠశాలలో ఒత్తిడి లేకుండా, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన, మధ్యాహ్నం భోజనం, పూర్తి సబ్సిడీపై పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందజేస్తుందని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, ప్రధానోపాధ్యాయులు ఆనంద్, పాఠశాల పంపి అధ్యక్షురాలు పంగి, ఉపాధ్యాయురాలు సక్కుబాయి, సి ఆర్ పి మహమ్మద్, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, అంగన్వాడి టీచర్ గోదావరి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ బడిలో సామూహిక అక్షరాభ్యాసం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES