- Advertisement -
నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని, జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని, రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం మహిళలంతా కలిసి భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించారు. అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని పూజించారు. అనంతరం రాఖీ బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు నల్ల నాగభూషణం, అకాడమీ ప్రిన్సిపల్ నాగేష్, ఉపాధ్యాయులు, మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -