Sunday, June 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ లో భారీగా చేరికలు

కాంగ్రెస్ లో భారీగా చేరికలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: ఈరోజు జుక్కల్ మండలంలోని దోస్పల్లి, బంగారు పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ మరియు కాంగ్రెస్ యూత్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది‌. అదేవిధంగా జుక్కల్ ఎంఎల్ఏ లక్మికాంతారావు అభివృద్ధి పనులు చూసి దోస్పల్లి గ్రామంలో  టిఆర్ఎస్ , బిజెపి పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలు భారీగా చేరడం జరిగింది. ఈ సందర్భంగా చేరిన వివిధ పార్టీల కార్యకర్తలు మాట్లాడుతూ.. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నిత్యం నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని వెను వెంటనే పరిష్కారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శివానంద్, మాజీ జెడ్పిటిసి సాయా గౌడ్ , దోస్పల్లి పండు పటేల్ , జూనియర్ కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

ఫోటోలు :- దోప్పల్లి మరియు బంగారు తల్లి గ్రామాల్లో కాంగ్రెస్ కి చేరిన టిఆర్ఎస్ ,  బిజెపి నాయకులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -