- Advertisement -
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మంతపురి గ్రామంలో బీఆర్ఎస్కు గట్టి ఎదురుదెబ్బగా భారీగా చేరికలు నమోదయ్యాయి. మంతపురి గ్రామానికి చెందిన పసుల సతీష్ రెడ్డి సహా దాదాపు 50 మంది నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరికలు ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే & డీసీసీ అధ్యక్షుడు బీర్ల అయిలయ్య సమక్షంలో జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్తగా చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తూ, గ్రామ అభివృద్ధికి కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న ఆదరణతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నెలకొంది.
- Advertisement -


