Saturday, May 24, 2025
Homeజాతీయంజార్ఖండ్‎ లో భారీ ఎన్ కౌంటర్..

జార్ఖండ్‎ లో భారీ ఎన్ కౌంటర్..

- Advertisement -

నవతెలంగాణ – రాంచీ: జార్ఖండ్‎ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ రోజు ఉదయం లతేహార్ జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. భద్రత దళాల కాల్పుల్లో మావోయిస్టు తిరుగుబాటు సంస్థ జార్ఖండ్ జన ముక్తి పరిషత్ చీఫ్ పప్పు లోహ్రా, ప్రభాత్ గంజు మృతి చెందారు. పరిషత్ చీఫ్ పప్పు లోహ్రా రూ.10 లక్షలు,  ప్రభాత్ గంజు తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా, లతేహార్ జిల్లాలో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలు ఎదురుపడగా.. ఇరు వర్గాలు పరస్పరం కాల్పులు జరుపుకున్నాయి. భద్రతా దళాలు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందగా.. మరో నక్సలైట్ గాయపడగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక ఇన్సాస్ రైఫిల్‌, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -