– పంజాబ్లో ఐదుగురు మృతి
చండీగఢ్: పంజాబ్లోని ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. 25 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన శ్రీ ముక్త్సర్ సాహిబ్ జిల్లాలోని లంబి నియోజకవర్గం పరిధిలోని సింఘే వాలా-ఫరీద్కోట్ కోట్లిలో శుక్రవారం జరిగింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, ఈ పేలుడు జరిగిన చోట అక్కడ రెండు క్రాకర్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఒక యూనిట్లో క్రాకర్లు తయారు చేసి, మరో యూనిట్లో క్రాకర్లు ప్యాక్ చేస్తారు. అయితే క్రాకర్లు తయారు చేసే చోట ఈ పేలుడు జరిగింది. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోగా, కొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అనంతరం వాపిని సివిల్ ఆస్పత్రికి, మరికొందరిని ఎయిమ్స్కి తరలించారు. ఎస్ఎస్పీ అఖిల్ చౌదరి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ‘బాణసంచా కర్మాగారంలో గురువారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో పేలుడు జరిగింది. ఈ ఫ్యాక్టరీలో 45-50 మంది వరకు వలస కార్మికులు పనిచేస్తున్నారు. వారందరికీ ఆ ఫ్యాక్టరీ లోపల వసతి ఉంది.
నిద్రపోగా..అకస్మాత్తుగా పెద్ద శబ్దం
‘నేను ప్యాకింగ్ పని చేస్తాను. మేము ప్యాకింగ్ చేసిన తర్వాత నిద్రపోయాం. అకస్మాత్తుగా వెనుక నుంచి పెద్ద శబ్దం వినిపించింది. వెంటనే పరిగెత్తి బయటకు వెళ్లి చూసే సరికి భవనం కూలిపోయింది. ఆ సమయంలో చాలా మంది కార్మికులు శిథిలాల చిక్కుకున్నారు. 25 మందికి పైగా కార్మికులు లోపల పనిచేస్తున్నారు. ఆ కార్మికులందరూ వలస వచ్చిన వారు.’ – అరుణ్ కుమార్, ఫ్యాక్టరీ ఉద్యోగి
లైసెన్సులేకుండానే అనధికారికంగా ఫ్యాక్టరీ నిర్వహణ
పోలీసులిచ్చిన సమాచారం ప్రకారం ఫ్యాక్టరీ యజమాని టార్సేమ్ సింగ్ తన భార్య పేరుతో ఫ్యాక్టరీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు
- Advertisement -
- Advertisement -