నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ పటాన్చెరులోని పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో సోమవారం భారీ ప్రమాదం జరిగింది. సీగాచి కెమికల్స్ కంపెనీలో రియాక్టర్ పేలుడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడగా, వీరిలో ఆరుగురు మృతిచెందారు. ఘటనాస్థలంలో ఐదుగురు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం. కార్మికుల్లో పలువురు ఫోన్లు పనిచేయకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్, ఇస్నాపూర్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.పేలుడు ధాటికి కార్మికులు 100 కిలోమీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఘటనాస్థలికి ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాాలు తెలియాల్సి ఉంది.
పటాన్చెరులో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES