Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయందేశ విద్యా రంగానికి పునాదులు వేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

- Advertisement -

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

స్వతంత్ర భారత దేశ విద్యాశాఖ మొదటి మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం ) సందర్భంగా విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ చైర్మెన్‌గా, వయోజన అక్షరాస్యత, సార్వత్రిక ప్రాథమిక విద్య, 14 సంవత్సరాల్లోపు బాలబాలికలందరికీ నిర్బంధ ఉచిత విద్య, వత్తి శిక్షణతో పాటు యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ ఏర్పాటు వంటి విభిన్న విధానాలతో దేశంలో విద్యారంగ ఆభివద్ధికి ఆజాద్‌ ఎంతగానో కషి చేశారని సీఎం రేవంత్‌ రెడ్డి కొనియాడారు.

ఆయన జయంతి రోజు నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. ఆయన స్పూర్తితో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందన్నారు. అందులో భాగంగానే గ్రామీణ, నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన ఉచిత విద్యనందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా అప్‌ గ్రేడ్‌ చేశామని, యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ఉపాధ్యాయులు, లెకర్చర్ల నియామకంతో రాష్ట్రంలో విద్యాభివద్దికి పాటుపడు తున్నామని సీఎం తెలిపారు.

జాతీ యోద్యమంలో పాల్గొనడంతో పాటు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షుని గా ఆజాద్‌ ఎనలేని సేవలు అందిం చారని సీఎం కొనియాడారు. ఖిలాఫత్‌ ఉద్యమములో పాల్గొని బ్రిటిష్‌ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరా డారనీ, జాతీయోద్యమములో హిందూ, ముస్లిం ఐక్యతను కోరుకొని దేశ విభజనను వ్యతిరేకించారని సీఎం గుర్తు చేసారు. స్వాతంత్య్రం అనంతరం మైనారిటీలకు గొంతుకగా నిలిచారనీ, ఆజాద్‌ జయంతిని మైనార్టీ సంక్షేమ దినోత్సవంగా జరుపుకుంటు న్నామనీ, ప్రజా ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ ‘రేవంతన్నా కా సహారా’ కింద ఫకీర్‌, పథకాలు ప్రారంభించి నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -