- Advertisement -
ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్
నవతెలంగాణ – మల్హర్ రావు
యేసుక్రీస్తు ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని మండలంలోని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గురువారం క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఎడ్లపల్లి చర్చిలో సర్పంచ్ జంగిడీ సునీత-శ్రీనివాస్ దంపతులు పాస్టర్ యేసేపు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ దంపతులకు పాస్టర్ శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ జరుపుకుంటున్న సోదరీ సోదరీమణులందరు ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఏసుక్రీస్తు ఆశీస్సులు ఉండాలని కోరారు.
- Advertisement -



