‘నవ్వి పోదురుగాక..నాకేటి సిగ్గు’ అన్నట్టుంది అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ తీరు. తన పాలనా తీరుపై ఎవరెన్ని విమర్శల బాణాలు ఎక్కుపెట్టినా తాను చేయదల్చు కున్నది చేస్తున్నాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకునేందుకు యుద్ధాలను ప్రోత్స హిస్తున్నాడు. అలాంటి యుద్ధోన్మాద పెట్టుబడి దారి దేశానికి పాలనా పగ్గాలు చేపట్టిన అధ్యక్షులందరితో పోల్చితే ట్రంప్ వ్యవహార శైలి ఆద్యంతర వివాదాస్పదమే. వలస వాదుల ఏరివేత, వాణిజ్య, వ్యాపారాలపై ఆంక్షల పేరిట ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. అమెరికాకు తానే రక్షకుడిననే రీతితో తగదునమ్మా అంటూ పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇండియా-పాకిస్తాన్, ఇజ్రాయిల్-ఇరాన్ల మధ్య యుద్ధాలను తానే ఆపాననే డాంభికాలు శ్రుతి మించాయి. మరో అడుగు ముందు కేసిన ట్రంప్ ప్రపంచాన్ని శాంతి పథంలో నడిపిస్తు న్నాననే గ్లోబల్ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. తాను నోబల్ శాంతి బహుమతికి అర్హుడినని ప్రపంచంతో చెప్పించేందుకు నానా తంటాలు పడుతున్నారు. తన గుప్పిట్లో దేశాలను నయా నో, భయానో ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన దాయాది పాకిస్తాన్ అయన పేరును నోబల్ కమిటీకి సిఫారస్ చేయడం ప్రపంచ శాంతి కాములను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. గురివింద గింజ తన నలుపెరుగదన్నట్టు ట్రంప్ తీరుంది.
– ఊరగొండ మల్లేశం
నవ్వి పోదురుగాక..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES