- Advertisement -
నోటీసులు ఇచ్చిన సర్పంచ్ లు..
నవతెలంగాణ – నవాబు పేట
మండలం పరిధిలోని ఇప్పటూర్ సమీపంలో వున్నా కొల్లాఫామ్ వల్ల ఈగలు ఇళ్లలోకి వస్తున్నాయని ఇప్పటూర్, చెన్నారెడ్డి పల్లి, మల్లారెడ్డి పల్లి గ్రామాల సర్పంచ్ లు రవి కిరణ్, నవనీత,తోట రాములు గ్రామ కార్యదర్శులతో కలిసి కోళ్ల ఫామ్ ల యాజమాన్యం , సిబ్బంది కి నోటీసులు ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యాజమాన్యం సకాలంలో స్పందించి ఈగల నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కోళ్ల ఫామ్ సిబ్బంది కేశవులు మాట్లాడుతూ మూడు గ్రామాల్లో ఈగల నివారణకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ లు రవి కిరణ్, నవనీత, తోట రాములు, రైతులు మైబు, రవి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



