Wednesday, June 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి..

సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు చేపట్టాలి..

- Advertisement -

జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
: వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశం మందిరంలో మెడికల్, మండల పంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ, రెసిడెన్షియల్  పాఠశాలల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తుగా  ప్రణాళికలను రూపొందించుకొని  అమలు చేయాలని తెలిపారు. గ్రామాలలో మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు అందుబాటులో ఉంటూ పిచ్చి మొక్కలను, వాటర్ హెడ్ ట్యాంకులను  ఎప్పటికపుడు శుభ్ర పర్చాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బి.సి మైనారిటీ, కె.జి.బి.వి హాస్టల్స్ లో మంచి నీటి ట్యాంకులను క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలన్నారు.ప్రతి శుక్రవారం రోజు ఫ్రై డే- డ్రై డే గా పాటించాలన్నారు.

ప్రతి గ్రామాలలో దోమల నివారణ కోసం ఫాగింగ్ స్ప్రే చేయాలన్నారు. ముందస్తుగా ఆయిల్ బాల్స్ ను తయారు చేసి అందుబాటులో ఉంచాలన్నారు. మురుగు నీటి నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ వేయడం ద్వారా దోమల నివారణ అరికట్టవచన్నారు. వాటర్ ట్యాంకుల పై కప్పు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.మెడికల్ సిబ్బంది, మండల పంచాయతీ అధికారులు సమన్వయంతో గ్రామంలో ఎలాంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు. గ్రామాలలో మంచినీటి సహాయకులు అందుబాటులో ఉండి మంచి నీటిని క్లోరినేషన్ చేసి, ట్యాంకులలో స్వచ్ఛమైన మంచి నీరును ట్యాంకులలో నింపాలన్నారు. ప్రతి గ్రామంలో ఆర్. ఓ ప్లాంట్ ఉన్నందున మంచినీటి కోసం ఆర్. ఓ ప్లాంట్ వాటర్ ను ఉపయోగించుకోవాలన్నారు.  రెసిడెన్షియల్ హాస్టల్స్ ఆవరణ  పరిధిలో ఉన్న చెత్త , చెదారం ఎప్పటికపుడు  శుభ్రపరచలన్నారు. గ్రామాలలో డ్రైనేజ్ పైప్ లీకేజీ లేకుండా చూడాలన్నారు. వైద్య సిబ్బంది రానున్న మూడు నెలలు సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. త్రాగు నీటి పరిశుభ్రత , క్లోరినేషన్, పారిశుధ్య నివారణ వంటి అంశాలలో పంచాయతీ అధికారులు, గ్రామ నీటి  అధికారులు చురుకుగా వ్యవహరించాలన్నారు. నీటి శాంపిల్ లను పరీక్షించి క్లోరిన్ స్థాయి చూడాలన్నారు. ప్రతి గ్రామంలో  అంగన్వాడీ కేంద్రాలలో, ప్రభుత్వ హాస్టల్స్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సి.ఈ.ఓ శోభా రాణి , జిల్లా పంచాయతీ అధికారి సునంద , జిల్లా వైద్య శాఖ అధికారి మనోహర్, మిషన్ భగీరథ అధికారి కరుణాకర్, జిల్లా వైద్య అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి. ఓ లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -