- Advertisement -
ఎంపిడిఓ క్రాంతి కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు
రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని మండల ఎంపిడిఓ క్రాoతి కుమార్ మిషన్ భగీరథ,పంచాయితీ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మతో కలిసి 2వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారానికి పైప్ లైన్,మురుగు నీరు వెళ్ళడానికి సైడ్ డ్రైన్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఏఈ అలేఖ్య,పంచాయతీ కార్యదర్శి రాజు, వర్క్ ఇన్స్పెక్టర్ నక్క దేవేందర్,మాజీ సర్పంచ్ సిద్ది లింగయ్య,వార్డు సభ్యుడు ఎడ్ల మధుసూదన్, పెద్ద నారాయణ పాల్గొన్నారు.
- Advertisement -



