Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఉభయ సభలు సజావుగా సాగడానికి మీడియా సహకరించాలి: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

ఉభయ సభలు సజావుగా సాగడానికి మీడియా సహకరించాలి: స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌

- Advertisement -


– హాజరైన మండలి చైర్మెన్‌ గుత్తా, మంత్రి శ్రీధర్‌బాబు
– అసెంబ్లీ మీడియా సలహా కమిటీ తొలి భేటీ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

శాసనమండలి, శాసనసభల కార్యకలాపాలు సజావుగా జరగడానికి అందరూ సహకరించాలనీ, ముఖ్యంగా మీడియా ప్రతినిధులు ఇందులో కీలక పాత్ర పోషించాలని అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ లేజిస్లేటివ్‌ మీడియా అడ్వైజరీ నూతన కమిటీ మొదటి సమావేశం గురువారం శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో జరిగింది. ఇందులో శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌, శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, లేజిస్లేటివ్‌ సెక్రెటరీ డా. వి.నరసింహాచార్యులు, కమిటీ చైర్మన్‌ ఐరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, కో చైర్మన్‌ పరిపూర్ణాచారి, సభ్యులు ఈ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో కీలకమైన శాసనసభ, మండలి గౌరవం, ప్రాధాన్యతలను కాపాడాలని కోరారు. మీడియా సలహా మండలి ద్వారా మీ వంతుగా సేవలను అందించేందుకు మంచి అవకాశమని చెప్పారు. సీనియర్‌ జర్నలిస్టులుగా ఎంతో అనుభవం మీరంతా ఉభయ సభలు సజావుగా జరగడానికి కృషి చేయాలన్నారు. మనందరం సభల్లో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలన్నారు. అందరమూ చొరవ చేయడం ద్వారా రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలనేది అందరి ఉద్యేశమని అభిప్రాయపడ్డారు. శాసనసభ సమావేశాల సమయంలోనే కాదు, ఇతర సమయాలలో కూడా శాసనసభకు సంబంధించిన వార్తలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు.
రెండూఒకే భవనంలోకి :గుత్తా
శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ శాసనసభ , శాసనమండలి సమావేశాలు సజావుగా నడవాలంటే మీడియా పాత్రనే కీలకమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభను హుందాగా నిర్వహించడానికి తోడ్పడాలని చెప్పారు. రానున్న రోజుల్లో శాసనసభ, శాసనమండలి ఒకే భవనంలోకి రాబోతున్నాయని చెప్పారు. కావున కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీడియా కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయం కావాలన్న అన్ని వేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సభా వ్యవహారాల్లో మీడియాకు బాధ్యత: శ్రీధర్‌బాబు
శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి వ్యవహారాలలో మీడియాకు బాధ్యతను కల్పించడానికి, మరింత పాత్రను పోషించడానికే మీడియా అడ్వైజరీ కమిటీని నియమించినట్టు తెలిపారు. ఉభయసభల నిర్వాహణలో అందరి సహకారాన్ని అవసరమన్నారు. సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులకు అవసరమైన పాసులు, సౌకర్యాలు, వసతులపై ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా సమావేశాల సందర్భంగా జారీ చేసే పాస్‌ల విషయంలో కమిటీ సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందనీ, మంచి వాతావరణంలో సమావేశాలు జరిగేలా అందరం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సభ్యులంతా సమావేశాల నిర్వహణ, పాసులు, వసతులపై అభిప్రాయాలు చెప్పారు.

అసెంబ్లీ మీడియా సలహా మండలి సభ్యుడు బి.బసవపున్నయ్యను అభినందిస్తున్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad