- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన డాక్టర్ మణిదీప్ రావును ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెడికల్ ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సెమినార్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా మెడికల్ ఎకైన్స్ అవార్డుతో మణిదీప్ ను ఘనంగా సన్మానించారు. అవార్డు అందుకొని మండలానికి పేరు తెచ్చినందుకు గ్రామస్తులు, మాజిప్రజా ప్రతినిధులు, నాయకులు అభినందించారు.
- Advertisement -