- Advertisement -
హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ సహకార సంఘాల నాయకులు
నవతెలంగాణ – కంఠేశ్వర్ : హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్రంలోని 311 సహకార సంఘాల అధ్యక్షులు సీఈవోల లతో సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ, సహకార మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పాల్గొన్నారు. అదేవిధంగా సహకార బ్యాంకు అధ్యక్షులు రవీందర్ రావు,నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి,వివిధ జిల్లా ల డీసీసీబీ ల అధ్యక్షులు పాల్గొన్నారు.
- Advertisement -