- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. ‘అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ ఆసుపత్రులను సమీపంలోని మెడికల్ కాలేజీలకు అనుసంధానం చేయాలి. మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతి నెలా బిల్లుల చెల్లింపులు జరగాలి. 99 డేస్ ప్రోగ్రాంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి’ అని ఆదేశించారు.
- Advertisement -



