డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినీ ఇండిస్టీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ’25 ఇయర్స్ అఫ్ శేఖర్ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ని లాంచ్ చేసి చిరంజీవి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్ కమ్ముల సోషల్మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ‘టీనేజీలో ఒక్కసారి చిరంజీవిని దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండిస్టీకి వచ్చి 25 ఇయర్స్ . ‘లెట్స్ సెలబ్రెట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవే. కొన్ని జనరేషన్స్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ఛేజ్ యువర్ డ్రీమ్స్ అని, సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది మెగాస్టారే. కాబట్టి, నా 25 ఇయర్స్ జర్నీ సెలబ్రేషన్స్ అంటే ఆయన సమక్షంలోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సర్. ఈ మూమెంట్లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్ కమ్ముల రాసుకొచ్చారు. అలాగే చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ధనుష్, నాగార్జున హీరోలుగా పాన్ ఇండియా మూవీ ‘కుబేర’తో శేఖర్ కమ్ముల అలరించడానికి రెడీ అయ్యారు.