No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeజిల్లాలు యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

 యోగాతో మానసిక ప్రశాంతత: ఎస్పీ శరత్ చంద్ర పవార్ 

- Advertisement -

జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
: యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  హాజరై మాట్లాడుతూ ..యోగా అనేది పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం మని యోగా చేయడం ద్వారా మనసు,శరీరాన్ని ఏక దాటిపై తీసుకొని రావచ్చని అన్నారు.ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరం 24 గంటలు విధినిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటపుడు మానసిక ప్రశాంతత కొరకు ప్రతి రోజు ఈ యోగా,ధ్యానం చేయడం ద్వారా ఆందోళన,వత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజాన్ని నింపుటకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఆర్.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad