- Advertisement -
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ – వేములవాడ : ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వారాహి పూజ, హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని, వారాహి అమ్మవార్ల దీవెన్లతో అందరు సంతోషంగా ఉండాలని అన్నారు. సకాలంలో వర్షాలు పడి ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -