- Advertisement -
ఆర్పీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత
నవతెలంగాణ – కంఠేశ్వర్
మెప్మా అర్పిల పెండింగ్ వేతనాలు విడుదల చేశారని మెప్మా అర్పిల నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం నవతెలంగాణ తో మాట్లాడుతూ.. గత ఆరు నెలలుగా వేతనాలు రావడం లేదని, పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఈనెల 8వ తేదీన ప్రజావాణిలో కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసామన్నారు. దీంతో స్పందించిన అధికార యంత్రాంగం ఈనెల 15వ తేదీన వేతనాలు విడుదల చేయడం జరిగింది అని వివరించారు. ఇందుకుగాను జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, మెప్మా పీడీ రాజేంద్రకుమార్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
- Advertisement -