- Advertisement -
హైదరాబాద్ : స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉన్న సింగపూర్కు చెందిన నీఓ సెమీ ఎస్జి ప్రయివేటు లిమిటెడ్తో ఎంఐసి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా తమకు సెమీకండక్టర్, ఎఐ అధారిత ఎనర్జీ రంగాల్లోకి ప్రవేశించేందుకు వీలు కలిగిందని ఎంఐసి పేర్కొంది. ‘ నీఓ సెమీకి చెందిన డీప్ టెక్ సామర్థ్యాలతో కలిసి, ఎంఐసి స్మార్ట్, సస్టైనబుల్ టెక్నాలజీ తయారీలో నాయకత్వం వహిస్తుంది.” అని ఎంఐసి ఎలక్ట్రానిక్స్ సిఇఒ రక్షిత్ మాథుర్ పేర్కొన్నారు.
- Advertisement -