శాన్ఫ్రాన్సిస్కో : టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వచ్చే వారం భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడానికి సిద్దమవుతోం దని బ్లూమ్బర్గ్ ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ఈసారి ఎక్స్బాక్స్ విభాగంలోని ఉద్యోగుల ను ఆ సంస్థ లక్ష్యంగా చేసుకొన్నట్లు తెలుస్తోం ది. ఇది గడిచిన ఏడాదిన్నరలో మైక్రోసాఫ్ట్ ప్రకటించి న నాలుగో అతిపెద్ద తొలగింపులుగా నిలిచిపోనుం దని పేర్కొంది. ముఖ్యంగా 69 బిలియన్ డాలర్లు వెచ్చించి యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేశాక.. లాభదాయకత, పొదుపు చర్యలపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది. ఇంతక్రితం మేలో ఇంజినీరింగ్, ప్రొడక్ట్ బృందాల్లోని 6,000 మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. 2024 జూన్ నాటికి మైక్రోసాఫ్ట్లో 2.28 లక్షల మంది ఉద్యోగులున్నారు.