‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని.. నిలపరా నీ జాతి నిండు గౌరవము’ అంటూ దేశ భక్తిని ప్రేరేపిస్తూ కవి రాయప్రోలు సుబ్బారావు చేసిన నినాదం తెలియని వారు ఉండరు. ఆ నినాదానికి వాస్తవ రూపం గావిస్తూ జాతి గౌరవాన్ని నిలపడమే కాదు జాతి పురోభివద్ధికి ఇతోధికంగా సహాయపడాలనే ఆశయంతో ముందుకు వస్తున్నారు ప్రవాస భారతీయులు. ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి, వ్యాపారం కోసం, జీవితంలో వద్ధి సాధించాలనే లక్ష్యంతో విదేశాలకు వెళ్లిన ప్రవాసులైన భారతీయులు తమ కలల లక్ష్యాలను చేరుకోవడానికి శ్రమిస్తూ ఉన్నత స్ధితికి చేరుకుంటున్నారు. అంతటితో ఆగకుండా తమ మాత భూమికి చేయూతనివ్వాలని తపిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలతో మరికొందరికి స్ఫూర్తి కలిగించాలని వారిని గౌరవించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులను ఒక తాటిపైకి తీసురావాలని భారత ప్రభుత్వానికి కలిగింది. అందుకే ‘ప్రవాస భారతీయ దివస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రవాస భారతీయ దినోత్సవం గురించి ఈ రోజు సోపతి ప్రత్యేక కథనం.
విదేశాలలో నివసిస్తున్న భారతీయుల విజయాలను ప్రపంచం ముందు తీసుకురావడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. తద్వారా వారి బలాన్ని, ప్రతిభను ప్రపంచం గుర్తించేలా చేస్తున్నారు. ప్రవాస భారతీయులు స్వదేశీయులతో కలిసే అవకాశం కల్పించడం వారి సేవలను దేశానికి వినియోగించు కోవాలనే లక్ష్యంతో దీన్ని జరుపుతూ వస్తున్నారు. జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికాలో విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని జనవరి 7వ తేదీ నుండి 9వ తేదీలలో ఈ దినోత్సవాన్ని 2003 నుండి భారత ప్రభుత్వం ఈ దినోత్సవం జరుపుతుంది. ఆరంభంలో దీన్ని ప్రతీ ఏడాది జరపగా 2019 నుండి ప్రతీ రెండేండ్లకు ఒక సారి ఒక్కొక్క ప్రాంతంలో జరుపుతున్నారు.

ప్రవాస భారతీయులు ఎవరు?
విదేశానికి వలస వెళ్లిన ‘భారతీయ పౌరులను’ ప్రవాస భారతీయులు అంటారు. ‘భారతదేశం’ వెలుపల జన్మించి, భారతీయ మూలం గల వ్యక్తిని లేదా శాశ్వతంగా భారతదేశం వెలుపల స్థిరపడిన భారత సంతతి వ్యక్తిని భారత సంతతి వ్యక్తిగా పరిగణిస్తారు.
ప్రవాస భారతీయులు రెండు రకాలు.
1. ఎన్ఆర్ఐలు: వీరు భారతదేశం వెలుపల నివసిస్తున్న భారతీయ పౌరులు. పన్ను ప్రయోజనాల కోసం, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ఒక వ్యక్తి భారతదేశంలో నివాసి కాకపోతే భారతదేశంలో నివాసం లేని వ్యక్తిగా చెప్పబడతారు. ఒక వ్యక్తి అంతకుముందు ఏ ఏడాదిలోనైనా భారతదేశంలో నివసిస్తున్నట్లు భావించబడతారు.
2.PIO/OCI: వీరు ఒకప్పుడు భారతీయ పౌరులు, కానీ ప్రస్తుతం మరొక దేశ పౌరసత్వం తీసుకొని భారతదేశం వెలుపల నివసిస్తున్నారు. వీరు భారతదేశంతో నేరుగా సంబంధం లేని భారతీయ మూలాలు కలిగిన వ్యక్తుల పిల్లలు కూడా కావచ్చు. వీరు భారతదేశం వెలుపల ఏ దేశంలోనైనా ఉండవచ్చు (పాకిస్తాన్, బంగ్లాదేశ్లకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి) బాగా చదువుకుని జీవితంలో ఉన్నతస్థాయికి ఎదిగి విదేశాల్లో స్థిరపడ్డ ఈ ప్రవాస భారతీయులంతా జన్మభూమి రుణం తీర్చుకునేలా విస్తతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పదిమందికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు వ్యక్తిగత స్థాయిలో సాయం అందిస్తున్నారు. మరికొందరు ట్రస్టులు ఏర్పాటుచేసి భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. గ్రామాభివద్ధి కోసం కొంతమంది నిధులు వెచ్చిస్తుండగా.. మరికొందరు విద్యార్థుల్ని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇంకొందరు చిన్నతనంలో తాము చదువుకున్న బడికి కొత్తరూపు కల్పించి తమ ఔదార్యం చాటుకుంటున్నారు. కొద్దిమందైతే ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు, నైపుణ్యాభివద్ధి కేంద్రాల వంటివీ ఏర్పాటు చేశారు. తమ ఊళ్లోని అందరికీ తాగునీరు ఉచితంగా అందేలా ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో రీతిలో సేవలందిస్తూ కన్నభూమి రుణం తీర్చుకుంటున్నారు.
ప్రపంచం నలుమూలలా…
భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారిక గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 210 దేశాలలో 3.2 కోట్ల మంది భారతీయులు, భారత సంతతివారు ఉంటున్నారు. వీరిలో 1.8 కోట్ల మందికి వారు ఉంటున్న దేశాల పౌరసత్వం ఉంటే.. 1.4 కోట్ల మంది మాత్రం భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు ఏకంగా 150 పైనే ఉన్నాయి. ఐరాస లెక్కల ప్రకారం ప్రపంచంలో ఇప్పటివరకూ అత్యధికంగా వలస వెళ్లింది భారతీయులే. మన దేశం తర్వాత స్థానాల్లో మెక్సికో (1.1కోట్లు), రష్యా (1.1కోట్లు), చైనా (కోటి), సిరియా (80లక్షలు) దేశాలున్నాయి.
ప్రపంచమంతా విస్తరించి ఉన్న మన భారతీయులు కొన్నిచోట్ల ఆర్థిక రంగానికి ఆయువుపట్టుగా నిలిస్తున్నారు. ఇంకొన్ని దేశాల్లో రాజకీయాల్ని శాసించే స్థితిలో ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మన సంస్కతీ, సంప్రదాయాల్నీ ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు. ఈ విధంగా భారతావని ప్రపంచ రాజకీయాల్లో సైతం తన ముద్ర వేస్తోంది. అంతే కాకుండా భారతీయ మూలాలున్న నేతలు అనేక దేశాల్లో కీలక పదవులను కూడా అధిరోహిస్తున్నారు. వారిలో అమెరికా ఉపాధ్యక్ష పదవిని అలంకరించిన కమలా హారిస్, రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇరాానే అలీ (గయానా ప్రెసిడెంట్), ప థ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హౌదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్ షణ్ముగరత్నం కూడా ఆ జాబితాలో చేరారు. అలాగే హైదరాబాద్లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్గా ఉన్న ఎస్.ఆర్.నాథన్ (1999-2011), దేవన్ నాయర్ (1981 -1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. 2021లో తయారు చేసిన ఓ జాబితా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లో భారత సంతతి నేతలు 200 మందికి పైగా ఉన్నత పదవుల్లో ఉన్నారు. వీరిలో 60 మందికి పైగా కేబినెట్ మంత్రి పదవుల్లో ఉన్నట్లు తెలుస్తుంది.

బహుళజాతి కంపెనీల్లో సీఈఓలుగా…
ప్రపంచంలోనే అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచారు, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన అగర్వాల్, శంతను నారాయణ్-అడోబ్,అరవింద్ కష్ణ-ఐబీఎం, నికేశ్ అరోరాపాలొ ఆల్టో నెట్వర్క్స్,పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి, అర్వింద్ కష్ణ- ఐబీఎమ్ గుంజన్ షా- బాటా, వసంత్ నరసింహన్- నోవార్టిస్, రేవతి అద్వైతి- ఫ్లెక్స్, పునీత్ రంజన్ – డెలాయిట్ వంటి వారెందరూ కూడా భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే.
స్వదేశానికి ఎక్కువ సొమ్ము పంపడంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2020-21 ఏడాదిలో భారత్కు ప్రవాసులు పంపిన మొత్తం రూ.6.4 లక్షల కోట్లు కాగా 2022లో రూ.8.2 లక్షల కోట్లు. ఈ విషయంలో ప్రపంచంలోనే భారత్దే అగ్ర స్థానం. గతానికి భిన్నంగా ప్రస్తుతం గల్ఫ్ దేశాల నుంచి కాకుండా అమెరికా, కెనడా, యూకే, సింగపూర్ లాంటి దేశాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి ఎక్కువ మొత్తం వస్తోంది. ఆరు గల్ఫ్ దేశాల నుంచి 28 శాతం వస్తుండగా ఒక్క అమెరికా నుంచే 23శాతం వస్తోంది. 2024లో ఇలా అత్యధిక సొమ్మును పంపింది భారతదేశానికే. ప్రవాస భారతీయులు, విదేశాల్లో ఉద్యోగాలు చేసే భారతీయులు.. ఇలాంటి వారంతా 129.1 బిలియన్ డాలర్లు అంటే రూ.11 లక్షల కోట్లకుపైగా మనదేశానికి పంపారు. ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో ఏ దేశానికీ ఇంతమొత్తం రాలేదు. 2024లో ప్రపంచదేశాలకు వచ్చిన మొత్తంలో మనదేశానికి వచ్చిన మొత్తం14.3 శాతం కాగా జీడీపీలో 2024లో మనదేశానికి వచ్చిన మొత్తం విలువ 3.3 శాతంగా ఉంది.
విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు..
స్వదేశానికి పంపే నగదునే విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్లలో 46 శాతం నిధులు.. నాలుగు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లకు వచ్చాయని ఆర్బీఐ సర్వే చెప్తోంది. విదేశాల నుంచి రెమిటెన్సులు అందుకుంటున్న రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో (19.0 శాతం) ఉంటే ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో (4.0 శాతం) ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర (16.7 శాతం), మూడో స్థానంలో కర్ణాటక (15.0 శాతం), నాలుగో స్థానంలో తమిళనాడు (8.0 శాతం), ఐదో స్థానంలో దిల్లీ (5.9 శాతం) నిలిచాయి. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల్లో సగానికి పైగా మొత్తాన్ని (59.2 శాతం) కుటుంబ నిర్వహణ కోసం వెచ్చిస్తున్నట్లు ఆర్బీఐ అంచనా. మరో 20 శాతం మొత్తాన్ని బ్యాంకుల్లో డిపాజిట్లుగాను, 8.3 శాతం నిధులను ఆస్తులు, షేర్లలో పెట్టుబడులుగాను పెడుతున్నట్లు గుర్తించింది.
మినీ ఇండియాలు
ప్రపంచంలో భారతీయ సంస్కతీ, సంప్రదాయాలూ, రుచులతో మినీ ఇండియా. లిటిల్ ఇండియాలుగా పేరు తెచ్చుకున్న ప్రాంతాలు ఉన్నాయి. మలేసియా రాజధాని కౌలాలంపూర్ లోని బ్రిక్ఫీల్డ్స్ ప్రాంతాన్ని లిటిల్ ఇండియాగా పిలుస్తారు. ఇక్కడి స్థానికుల్లో ఎక్కువమంది భారతీయ మూలాలున్నవారే. భారత్లో దొరికే ప్రతి వస్తువూ ఇక్కడ లభిస్తుంది. అలాగే అమెరికాలోని షికాగో నగరంలో ఉన్న డెవాన్ ఎవెన్యూ వెళ్తే పెద్ద ఎత్తున భారతీయ రెస్టరెంట్లే కాదు చీరల దుకాణాలూ ఉంటాయి. మన దేశ సంస్కతి కనిపించే సింగపూర్లో భారతీయ రెస్టరెంట్లూ, దుకాణ సముదాయాలూ చాలా ఎక్కువ. అన్నిరకాల రుచులూ దొరుకుతాయి. ఇక ప్రపంచ ఫ్యాషన్ రాజధాని ప్యారిస్ వెళ్లిన మనవాళ్లు తప్పనిసరిగా సందర్శించే ప్రాంతం రూ దు ఫాబొ. అక్కడ భారతీయులకు అవసరమైన దేశీయసరకులే కాదు, ప్యారిస్ ఫ్యాషన్లు అద్దిన దుస్తులూ అక్కడ లభిస్తాయి.
తెలుగు వారి ఖ్యాతి
ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన వివిధ వత్తి ఉద్యోగ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో తెలుగువారు అనేకులు ఉన్నారు. ఏటా తెలుగు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల రూపేణా ఖర్చవుతున్న ఎన్నారై తెలుగువారి సొమ్ము వందల కోట్లు ఉంటుందంటే అతిశయోక్తి కాదు. కేవలం సేవా కార్యక్రమాలు మాత్రమే కాదు, విదేశాల్లో ఎదిగినవారు స్వదేశంలోనూ పరిశ్రమలు పెడుతున్నారు. సొంత ప్రాంతాల్లో వందల వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇంకొందరైతే తమ సొంతూరిలోని ప్రజలకు ఇళ్లు నిర్మించడం, నిర్మాణానికి కొంత ఆర్థిక చేయూత అందించటం, ఎత్తిపోతల పథకాలు నిర్మించటం వంటివీ చేస్తున్నారు. తెలుగువారు ప్రవాసులుగా ఎదుగుతున్న ప్రతి పరిణామమూ తెలుగు ప్రాంత అభివద్ధికి నేరుగానే కారణం అవుతోంది. అగ్రరాజ్యం అమెరికాలో సుమారుగా అయిదు లక్షల పైచిలుకు తెలుగువారు ఉన్నారనేది ఒక అంచనా. కేవలం అమెరికా నుంచే ఉభయ తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఎన్నారైలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు కొన్ని వందల కోట్ల రూపాయల్లో ఉంది. అమెరికాలో ఇంత భారీ సంఖ్యలో ఉన్నప్పుడు అక్కడ తెలుగు సంఘాలు కూడా అనేకం ఏర్పడ్డాయి. ఇవి సేవా కార్యక్రమాలతో పాటు తెలుగు భాష సాహిత్యం సంస్కతీ వైభవాలను పరిరక్షించడంలో కూడా ఎంతగానో కషి చేస్తున్నాయి. అమెరికాలో తొలి తెలుగు సంస్థ ‘తానా’ ఈ దిశగా అందరికీ మార్గనిర్దేశం చేసిందనే చెప్పొచ్చు. ఆటా, నాటా వంటి అనేక ఇతర సంఘాలు ఇలాంటి సత్కార్యక్రమాలను అనుసరిస్తున్నాయి.
ప్రవాసీ భారతీయ దివస్
ఈ ఏడాది ప్రసావ భారతీయ దివన్ను భువనేశ్వర్లో జనవరి 8 నుంచి 10 వరకు భారీ వేడుకలతో నిర్వహించడానికి ఒడిశా సిద్ధమైంది. ఈ వేడుకలో ఎంతో మంది అతిథులు, విదేశాలలో ఉన్న భారతీయులు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగుపరడంలో కూడా విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. స్వదేశానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రవాస భారతీయుల పట్ల ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు బాధ్యతను, సహకారాన్ని అందించి ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునేలా చేయడంలో ఈ వేడుక ఎంతగానో ఉపయోగ పడుతుంది. విదేశాలలో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగిరావడానికి దేశ అధికారులతో మాట్లాడటం వంటి కీలక అంశాలు ఈ సమావేశాల నిర్వహణ ద్వారా మెరుగుపడతాయి. ఈ కార్యక్రమానికి 7,000 మంది ప్రవాసులు, 10,000 మంది అతిథులు వస్తారని భావిస్తున్నారు. ‘అభివద్ధి చెందిన భారతదేశంలో డయాస్పోరా పాత్ర’ అనే థీమ్తో ఇది జరుగుతుంది.
‘అభివద్ధి చెందిన భారతదేశంలో డయాస్పోరా పాత్ర’ అనే అంశం 2047 నాటికి ప్రగతిశీల, ఆర్థికంగా దఢమైన భారతదేశం కోసం దష్టిని ప్రతిబింబించడానికి సాంకేతికత పాత్ర, భారతదేశ వద్ధి పథంలో ప్రవాసుల సహకారంపై కూడా ఈ సమావేశంలో దడుతున్నారు. ఈ మెగా ఈవెంట్కు రూ.120 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీన్ని ఒడిశా ప్రభుత్వం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమానంగా పంచుకుంటాయి.
ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు
విదేశీ భారతీయులకు అందించే అత్యున్నత గౌరవమే ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు. భారత ప్రభుత్వం 2003లో ఈ ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డులను ప్రారంభించింది. ఈ సమావేశాల్లో భారత రాష్ట్రపతిచే ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. భారతదేశంలో దాతత్వ పెట్టుబడులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, విదేశాలలో భారతీయులు సాధించిన విజయాలు, ఇండియా ప్రతిష్ట పెరిగే కార్యక్రమాలు విదేశాల్లో అమలు పరచడం, వారి నివాస దేశం మధ్య సన్నిహిత సంబంధాలను ఏర్పరచడం, స్థానిక భారతీయ సమాజ సంక్షేమం, స్వదేశంలో దాతత్వ కార్యక్రమాలు, తమ రంగంలో తమ వత్తిలో ఔన్నత్యాన్ని సాధించడం.. ఇలా ఏదైనా ఒక దానిలో గణనీయమైన కషి చేసిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులకు ఈ అవార్డును ప్రధానం చేస్తారు.
మేధో వలస సమస్య
ప్రపంచ దేశాలకు మేధావులను అందించడంలో భారత్ కీలక పాత్ర వహిస్తుంది. అయితే ఉపాధి అవకాశాలు కోసం విదేశాలకు వెళ్లడంలో ఎటువంటి ఆక్షేపణ లేదు. అయితే మేధస్సు కలిగిన వారు స్వదేశంలో మంచి అవకాశాలు లభించకపోవడం వల్ల స్వదేశాన్ని వీడి వెళ్లడం లేదా మేధో వలస అనేది మాత్రం భారతీయుల్ని ఎక్కువగా కలవరపెడుతున్న అంశం. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ లెక్కల ప్రకారం వలసపోతున్న నిపుణులూ, విద్యావంతుల్లో భారతీయులే ఎక్కువ. భారత్ నుంచి 100 మంది విదేశాలకు వెళ్తే వారిలో 65 శాతం నిపుణులూ, విద్యావంతులే. 2000-2020 మధ్య కోటి మంది భారత్ను విడిచి వెళ్లారు.
పార్లమెంట్ లెక్కలు
2015 నుంచీ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విడుదల చేసిన లెక్కల ప్రకారం.. 2015లో 1,31,489, 2016లో 1,41,603, 2017లో1,33,049, 2018లో 1,34,561, 2020లో 85,242, 2021లో సెప్టెంబర్ వరకు 1,11,287 మంది భారతీయులు స్వదేశాన్ని వీడారు. వీరిలో వేల సంఖ్యలో మిలియనీర్లు ఉన్నారు. ఇంతకంటే ఆందోళన కలిగించే మరొక విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేల మందికి పైగా భారతీయ పౌరసత్వానికి స్వస్తి పలికారు.పైగా సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్ధపై నమ్మకం లేకపోవడం, భారత దేశంలో పన్నుల వ్యవస్ధ ఈ పరిస్ధితికి కారణంగా వారు చెబుతున్నారు. విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న వాళ్లు కచ్చితంగా భారత పౌరసత్వాన్ని వదులుకోక తప్పదు. ఎందుకంటే ద్వంద్వ పౌరసత్వాన్ని భారత్ అనుమతించదు. దీంతో విదేశీ పౌరసత్వం కోరుకుంటున్న అనేక మంది తమ పౌరసత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఇటువంటి వారందరూ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఓసీఐ ద్వారా ప్రవాసీయులు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు, నివాసం ఉండేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు అనుమతి లభిస్తుంది.
మెరుగైన అవకాశాలు కల్పిస్తే
విదేశాల్లో మెరుగైన అవకాశాలు లభిస్తున్నప్పుడు మేధో వలస జరగకుండా అపాలంటే మేధావుల విజ్ఞానం మాతదేశ అభ్యున్నతికి ఉపయోగించుకోగలగాలి. అప్పుడే దీన్ని అరికట్టగలం. దానికి మెరుగైన అవకాశాలు మనం కల్పించగలిగితే ఆ విలువైన మానవ వనరులను మనమే ఉపయోగించుకుని దేశాన్ని మరింత ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లగలం. మన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు డబ్బు పంపుతున్నారు, సేవలు చేస్తున్నారు అని సంబరపడి సరిపెట్టుకున్నంత కాలం మేధో వలస అప్రతిహాతంగా కొనసాగుతూనే వుంటుంది. రెండేండ్లకు ఒక సారి నిర్వహించే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకలో భారత విదేశీ మారక ద్రవ్యాన్ని అందిస్తున్న ప్రవాస భారతీయులను మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో భరతమాత ముద్దుబిడ్డలుగా కీర్తిస్తున్నాం. అవార్డులు అందించడంతో సరిపెట్టుకుంటున్నాం. ఈ వేడుకలు కూడా పాశ్చాత్య దేశాలలో నివాసం ఉంటున్న వారి కోసం జరుగుతున్నాయనే విమర్శ బలంగా వినిపిస్తోంది.
మార్పులు అవసరం
ఈ ప్రవాసీ దివస్ సందర్భంగా గల్ఫ్లోని ప్రవాసుల సమస్యలు లేదా అభిప్రాయాలను కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే ఈ వేడుక పెద్దోళ్ల పెళ్ళిలో పేదలకు అవమానం అన్న చందంగా ఉంటుందనే విమర్శ కూడా ఉంది. ప్రతీ ఏడాది ఈ వేడుకను నిర్వహించడం భారంగా భావించి రెండేండ్లకు ఒక సారి నిర్వహిస్తూ తూతూ మంత్రంగా జరుపుతున్నారు. దీనివల్ల పాశ్చాత్య దేశాల పౌరసత్వం పొందిన సంపన్న ప్రవాసీయుల జాతరగా మాత్రమే ఈ వేడుక మిగిలి పోతుంది. రెండేండ్లకు ఒక పర్యాయం ప్రవాస భారతీయులను స్మరిస్తూ వేడుకలు జరపడం కన్నా నిత్యం ప్రవాస భారతీయుల నైపుణ్యాలు, సేవలు భారత దేశం వచ్చేలా ప్రోత్సహించాలి. అందుకు తగ్గ పరిస్థితులను కల్పించాలి. అప్పుడే విదేశాల్లోని మన వారి కషి ఫలితాన్ని మనం పొందగలం. అలా కాకుండా ప్రవాస భారతీయులందరూ భారత అంబాసిడర్లు ‘మీరంతా దేశానికి దూతలు. దేశ బ్రాండ్ అంబాసిడర్గా మీ పాత్ర విభిన్నం’ అని ఎన్ని పొగడ్తలు చేసినా ప్రయోజనం ఉండదు. అందుకని మన దేశ విదేశీ వ్యవహారాలలో ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఎన్నారైల సేవలను మరింత సమర్థంగా వినియోగించుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. అప్పుడే దేశీయంగా మౌలిక సౌకర్యాలు మెరుగు పడతాయి. ఆర్థికంగా కూడా దేశం అభివ ద్ధి చెందుతుంది.
– రుద్రరాజు శ్రీనివాసరాజు, 9441239578



