Sunday, June 29, 2025
E-PAPER
Homeజోష్మినిమైజ్ వాహ‌నం

మినిమైజ్ వాహ‌నం

- Advertisement -

టెక్కు చూపించడంలోనే కాదు.. టెక్నాలజీని ఒడిసిపట్టడంలోనూ కుర్రాళ్లు ముందే! సరదాల్లో చెలరేగిపోవడమే కాదు.. సృజనాత్మకత ప్రదర్శించడంలోనూ దిట్టలే!! ఆ నైపుణ్యాలే వారిని అందలం ఎక్కిస్తున్నాయి. కాలుష్యం పెచ్చరిల్లుతోంది.. ఇంధన ధరలు పైపైకే వెళ్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు, ఆటోమొబైల్‌ కంపెనీలు విద్యుత్తు వాహనాల మంత్రం జపిస్తున్నాయి. దీన్ని ముందే పసిగట్టాడు కాకినాడకు చెందిన సుధీర్‌ అనే యువకుడు. అతడి వినూత్న ఆవిష్కరణ గురించి ఈ వారం జోష్‌ లో తెలుసుకుందాం.

బాగా చదివామా.. పాసయ్యామా.. కొలువు కొట్టామా.. అనేదే నేటి యువత ఆలోచన. పుస్తకాలకో, కంప్యూటర్లకో పరిమితం కాకుండా వైవిధ్యమైన ఆలోచనలతో.. వినూత్న ఆవిష్కరణల చేస్తున్నారు. సరికొత్త వాహనాల తయారీ.. కొత్త డిజైన్లు రూపొందిస్తారు. అందుబాటులో ఉన్న సాంకేతికతకి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతారు. అలా వాళ్ల చేతుల్లో రూపుదిద్దుకున్న ఈ-రిక్షాలు, ఈ-వాహనాలు.. మామూలు నమూనా వాహనాలేం కాదు.


నేటి కాలంలో మనం ప్రయాణం చేయాలంటే వాహనం తప్పనిసరి. కారుతోనో, బైక్‌ తోనో రోడెక్కితే చాలు ట్రాఫిక్‌. ఆ పద్మవ్యూహంలో చిక్కుకుంటే గంటల తరబడి నరకయాతన అనుభవించాల్సిందే. ట్రాఫిక్‌ కు పగలు, రాత్రి అనే తేడానే లేదు. ఆఫీసుకు వెళ్లాలన్నా, అత్యవసర పనికి, విద్యార్థులు స్కూల్‌, కళాశాలకు వెళ్లాలన్నా ఈ ఇబ్బందులను చవిచూస్తూ ముందుకు సాగాల్సి వస్తోంది.


నిమిషానికి వందల వాహనాలు గమ్యస్థానాలు చేరుకునేందుకు పోటీపడుతూ వెళ్తున్న వాహనదారులు. క్షణమైనా వాహనాలు ఆగితే అటువైపు దాటేందుకు ప్రయాసపడుతున్న పాదచారులు. మరోవైపు ప్రయివేటు బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తాయి. ఇలా నిత్యం మనకు నగరాలు, పట్టణాల్లో కనిపించే దశ్యాలు. ఇక కారులో బయటికి వెళ్తే ట్రాఫిక్‌ లో కనుక చిక్కుకుంటే మనకు ఓ పద్మవ్యూహంలా కనిపిస్తోంది. గమ్యస్థానాన్ని చేరుకునే వరకు ఊపిరి సలపదు.


ఈ ఇబ్బందులే కాకినాడకు చెందిన సుధీర్‌ కూడా అనుభవించాడు. అప్పుడే అతనిలో కొత్త ఆలోచన మెరిసింది. దాంతో వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. తనకున్న ప్రతిభతో పాటు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఓ వినూత్న జీపును తయారు చేశాడు. మరీ ఇందులో ఏంటి ప్రత్యేకత అంటే? ఈ జీపులో ఇద్దరు ప్రయాణికులుంటే రెండే సీట్లు ఉండేలా నలుగురు ఉంటే మరో రెండు పెంచుకునేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు.
ప్రత్యేకంగా ఒక జీపును తయారు చేసి ప్రశంసలు అందుకున్నాడు. ఈ జీపు ప్రత్యేకత ఏమిటంటే ప్రయాణికుల సంఖ్యను బట్టి సీట్ల సంఖ్యను మార్చుకునే అవకాశం ఉంది. బెంగళూరులో ఉద్యోగం చేసిన సుధీర్‌ అక్కడి ట్రాఫిక్‌లో ఎదుర్కొన్న ఇబ్బందుల్లోంచి వచ్చిన ఆలోచనకు రూపమే ఈ జీపు. మూడు నెలలు శ్రమించి హైడ్రాలిక్స్‌తో వాహన వెడల్పు మార్చుకునేలా చేశాడు. టాప్‌ లెస్‌ జీప్‌ తయారు చేయడానికి 6 నుంచి 7 మందితో టెక్నికల్‌ టీం ఉంటే 30రోజులు పడుతుంది. అదే టాప్‌ ఉన్న జీప్‌ తయారు చేయడానికి అయితే ఇదే టెక్నికల్‌ టీంకు 45రోజుల్లో తయారు చేయవచ్చు.


ఒక బటన్‌ నొక్కగానే జీపు వెడల్పుగా మారుతుందంటున్నారు. ఈ వాహనం తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయిందని.. రాబోయే రోజుల్లో దీనిని రూ.1.80 లక్షలకు తయారు చేయాలని టార్గెట్‌ పెట్టుకున్నట్లు సుధీర్‌ అంటున్నారు. తనకు ఎవరైనా ప్రోత్సాహం అందిస్తే మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తానంటున్నారు. సుధీర్‌ తయారు చేసిన ఈ వాహనం గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది. సుధీర్‌ తయారు చేసిన ఈ వాహనం గ్రామీణీ ప్రాంతాలతో పాటుగా పట్టణం, నగరాల్లో కూడా ఉపయోగకరంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చులో అందుబాటులోకి వస్తుందని.. చాలా సౌకర్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తం మీద సుధీర్‌ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


ఇద్దరు మాత్రమే ఉన్నప్పుడు డ్రైవర్‌ పక్కన, దాని వెనుక ఉన్న 2 సీట్లు మడిచి జీపు వెడల్పును ఆ మేరకు తగ్గించొచ్చని తెలిపారు. బ్యాటరీతో నడిచే ఈ వాహనం తయారీకి రూ.2.50 లక్షలు ఖర్చయిందని వివరించారు. రానున్న రోజుల్లో రూ.1.80 లక్షలకు తయారు చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. చేయూత ఇస్తే మరిన్ని ఆవిష్కరణలు చేస్తానని సుధీర్‌ తెలియజేశారు.


ప్రభుత్వ సహకారం ఉండాలి
నూతన ఆవిష్కరణలు వెలుగు చూడాలంటే కచ్చితంగా ప్రభుత్వ అండ ఉండాల్సిందే. అప్పుడే మా లాంటి వారు కొత్త ఆవిష్కరణలు చేయగలరు. చైనా లాంటి దేశాలు బాగా ప్రోత్సాహన్ని అందిస్తున్నాయి. అక్కడ అందుకే టెక్నాలజీ అందిపుచ్చుకొని యువత సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతుంది. అలాంటి ప్రోత్సాహం మన దేశంలో యువతకు కావాలి.


ఫ్యామిలీ సహకారం
తండ్రి చిన్నప్పుడే చనిపోయినా తల్లి సహకారంతో చదువుకొన్నాను. నేను నాన్‌ ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ ను. ఎంబీఏ చేసి హైదరాబాద్‌, బెంగళూర్‌ లలో హెచ్‌ ఆర్‌ గా వర్క్‌ చేశాను. కానీ, బెంగళూర్‌ లో ఉండాగానే లే ఆఫ్‌ తో ఉన్న ఉద్యోగం పొయింది. దీంతో ఎప్పటి నుంచో ట్రాఫిక్‌ కష్టాలు ఎదుర్కోవడానికి ఏదైనా చేయాలన్న ఆలోచన ఉండేది. దానికి కొంత పదును పెట్టి మూడు నెలలు అదే పనిగా కూర్చోని హైడ్రాలిక్స్‌తో వాహన వెడల్పు మార్చుకునేలా ఈ జీప్‌ తయారు చేశాను. అవసరమైనప్పుడు బైక్‌ లా మార్చుకోవచ్చు. వీటంన్నిలో నాకు వెన్నుదన్నుగా నిలించిది అమ్మ.
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -