Tuesday, June 17, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్

- Advertisement -

నవతెలంగాణ – వేములవాడ : కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని సోషల్ జస్టిస్ సాధ్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో కలసి రాజన్నను దర్శించుకున్నారు.ఈ సందర్బంగా అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ లకు ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. స్వామి వారికి కోడెమొక్కు చెల్లించుకొన్న అనంతరం స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. కల్యాణ మండపంలో మంత్రి , విప్ లకు ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వదించిన అనంతరం ఆలయ ఈఓ రాధ బాయ్ శేష్ వస్త్రం అందించి లడ్డుప్రసాదంతో పాటుగా స్వామి వారి చిత్రపటానికి అందజేశారు. అనంతరం చైర్మన్ గెస్ట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మా ఇంటి ఇలవేల్పు, కులదైవం వేములవాడ రాజన్న అని, ఏ పని మొదలుపెట్టిన స్వామి వారిని దర్శించుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. 1984లో ఎన్ ఎస్ యు ఐ నుండి మొదలుకొని నేటి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ప్రయాణం కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడు యాత్ర దేశ రాజకీయాలను మార్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు సోషల్ జస్టిస్ జరుగుతుందని ఆయన వెల్లడించారు.

సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మార్గ నిర్దేశాలతో, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమను దూసుకు వెళ్తున్నట్లు ఆయన వెల్లడించారు. మిగులు రాష్ట్రంగా ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత గత బిఆర్ఎస్ ప్రభుత్వానిది, అయితే ప్రతి నెల వడ్డీలు కడుతూ ప్రజల సంక్షేమ పథకాలను ఆపకుండా అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీకి, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 59 వేల ఉద్యోగులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దేనిని అన్నారు. 18 నెలలనే ఈ స్థాయిలో ప్రజా సంక్షేమానికి కృషి చేసిన రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందా అని ప్రశ్నించారు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడైనా ఇలాంటి పథకాలు అమలు చేస్తున్నారని చెప్పాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసినందుకు ఆగస్టు 1న అసెంబ్లీ చట్టం చేశారని రాబోయే రోజుల్లో దేశంలో ఇదే అమలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దీవెనలతో, ప్రజల ఆశీస్సులతో, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతర్ ఆశీస్సులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో అప్పగించిన ఎస్సీ ఎస్టీ మైనార్టీ శాఖ పనులను సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు శాఖలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తూ గత ప్రభుత్వం ప్రజలకు అందించలేని సేవలను అందిస్తూ ప్రజాపాలనలో ముందుకు తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తోపాటు తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -