- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక : దుబ్బాక మున్సిపాలిటీ లచ్చపేట 11వ వార్డులోనున్న శ్రీ రాజరాజేశ్వర దేవాలయ అభివృద్ధికి నిధులు కేటియించాలని కోరుతూ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖను యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పడాల వినయ్ కుమార్ ఇటీవలే మర్యాదపూర్వకంగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా స్పందించిన మంత్రి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
- Advertisement -