నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని బండ సోమవారం గ్రామంలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఇంట్లో నిర్మాణం చేపడుతుండగా వాటిని రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను పరిశీలించి, వారితో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇండ్లు వస్తున్నాయని అన్నారు. దురదగ తిన పూర్తిచేసిన లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, వంట స్టవ్ గ్యాస్ లను పంపిణీ చేశారు. ప్రభుత్వం భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులతో ప్రజలను చైతన్యం చేస్తూ , భూ సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, డిసిపి ఆకాంక్ష యాదవ్, జిల్లా అదరపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, స్థానిక మాజీ సర్పంచ్ నానం పద్మకృష్ణ గౌడ్, డిఆర్డిఓ నాగిరెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం, ఫకీర్ కొండల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, పీసీసీ కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్, కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించిన మంత్రి పొంగులేటి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES