Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలువనమహోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష..

వనమహోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర‌వ్యాప్తంగా పచ్చదనాన్ని మ‌రింత విస్త‌రింప చేయాల‌న్న లక్ష్యంతో రాష్ట్ర‌ ప్రభుత్వం ప్ర‌తి ఏడాది మొక్కలు పెంచే కార్యక్రమాన్ని వ‌న మ‌హోత్స‌వం పేరిట చేప‌డుతోంది. అయితే, ఈ ఏడాది అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను స‌మీక్షించేందుకు రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మంగ‌ళ‌వారం డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మావేశం సంబంధిత అధికారుల‌తో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణ, ఎంఏ యూడీ సెక్రటరీ టీకే శ్రీదేవి, ప్రియాంక వర్గీస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జూన్‌ మొదటి వారంలో మొక్కలు నాటాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని అధికారులు సిద్ధం చేసిన పీపీటీని మంత్రికి నివేదించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad