నవతెలంగాణ-హైదరాబాద్ : రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేదో మదన సదస్సు 2025కు మంత్రి సీతక్క హజరయ్యారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు అయిన స్టాళ్లను పరిశీలించారు.అంగన్వాడి చిన్నారుల అభ్యాసం కోసం వినూత్నంగా రూపొందించిన టీచింగ్ మెటీరియల్ స్టాల్ పరిశీలించి అభినందించారు. అంగన్వాడీ చిన్నారులకు పంపిణీ చేసే స్నాక్స్, బాలమృతం రుచి చూశారు. బాలామృతంను ప్యాకెట్లలో కాకుండా బాక్సుల్లో ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మహిళా సంఘాల ద్వారా మెటీరియల్ ను రూపొందించి ప్రతి అంగన్వాడి కేంద్రానికి పంపిణీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రి సీతక్క వెంట టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ ఫహిo, మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉన్నారు.
రాజేంద్రనగర్ లో మేదో మదన సదస్సుకు హజరైన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES