జూన్ 11న మండల కేంద్రము లో జరుగబోయే డా||బీ ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన సభను విజయవంతం చేయాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ – తాడ్వాయి : ఈనెల జూన్ 11న మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాలని మంత్రి సీతక్కకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత విశ్వ మానవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ ఈనెల 11న మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. నలుమూలల నుంచి దళిత బహుజనులు పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ ముదిరాజ్, మేడారం ట్రస్ట్ బోర్డు చైర్మన్ అరేమ్ లచ్చు పటేల్, సహకార సంఘం మాజీ చైర్మన్ పాక సాంబయ్య, మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్ దొర, నాయకులు పిరీల వెంకన్న, యువజన నాయకులు కోరం నందు, సీతక్క యువసేన జిల్లా అధ్యక్షులు చర్ప రవీందర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు ధుబాసి సుధాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహావిష్కరణ పోస్టర్ విడుదల చేసిన మంత్రి సీతక్క
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES