నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ మండల ఎంపిపి,కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తల్లి అయిత లక్ష్మీ బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదివారం మృతురాలి కుటుంబాన్ని పరమర్షించి, సానుభూతి ప్రకటించారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ కోట రాజబాబు, తాడిచర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య,మాజీ ఎంపిపి ఇస్నపు రవి, కమలొద్దిన్ పాల్గొన్నారు.
ప్రకాష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES