నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ఐటి, ఇండస్ట్రియల్, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 56 జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో స్థానిక అంబేద్కర్ సెంటర్ లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ మాట్లాడుతూ….. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు.నాడు తెలంగాణ బిల్లును అసెంబ్లీలో మొట్టమొదటిసారి ప్రవేశపెట్టి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మేరకు తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు శ్రీధర్ బాబు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మంత్రిగా విదేశాల నుండి అనేకమైన పెట్టుబడులు తీసుకొస్తూ ఈ దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్ గా నిలిచే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు కలకాలం జీవించాలని బట్టు కరుణాకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడ బడిదల ప్రసాద్, తరుణ్ రాజు, అఖిల్, ప్రవీణ్, తిలక్, వినోద్, మధుకర్, అశోక్ వీరేందర్, శివ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES