- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు కొంత అస్వస్థతకు గురై కొన్ని రోజులుగా హైదరాబాదులోని ఏఐజి ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రికి వెళ్ళి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఆస్పత్రి వ్యవస్థాపకుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత డా.నాగేశ్వర్ రెడ్డిని, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారక నాథరెడ్డిని అడిగి ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితిని గూర్చి ఆరా తీశారు. వెంటనే స్పందించిన వైద్య బృందం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని మంత్రికి వెల్లడించారు.
- Advertisement -