- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వల్లెంకుంట గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, మాజీ మండల ఎంపిపి, కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి తల్లి అయిత లక్ష్మీ బాయి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ శనివారం మృతురాలి కుటుంబాన్ని పరమర్షించి, సానుభూతి ప్రకటించారు. అనంతరం మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -