- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఉషా సంతోష్ మేస్త్రి కుటుంబ సభ్యులైన సంతోష్ మేస్త్రికి శుక్రవారం మజీద్ వద్ద మైనార్టీ సోదరులు శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. సర్పంచ్ కుటుంబ సభ్యులతో పాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలుకు మాజీ ఎంపీపీ ప్రజ్ఞకుమార్ కు మైనార్టీ సోదరులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మైనార్టీ సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అండగా ఉంటూ కృషి చేస్తానని తెలిపారు ఈ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.
- Advertisement -



