నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండల కేంద్రంలోని మిసిమి ఉన్నత పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థి సిహెచ్ శాశ్వంత్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ బాలి రవీందర్ సోమవారం తెలిపారు. ఈ నెల ఒకటవ తేదీన కల్లెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయి పోటీలకు శాశ్వంత్ ఎంపికైనట్లు తెలిపారు.ఈ నెల 4 నుండి 6వ తేదీ వరకు నల్గొండ జిల్లా నఖీరేకల్ లో నిర్వహించే 47వ రాష్ట్ర స్థాయి పోటీలలో నిజామాబాద్ జిల్లా జట్టు తరుపున పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్బంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన శాశ్వంత్, పాఠశాల వ్యాయామ ఉపాద్యాయుడు సంజీవ్ ను పాఠశాల కరెస్పాండంట్ బాలి రవీందర్, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినదించారు.
రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మిసిమి విద్యార్థి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES