Friday, May 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంనేడు యాదాద్రిభువనగిరి జిల్లాకు..విశ్వసుందరి పోటీదారులు

నేడు యాదాద్రిభువనగిరి జిల్లాకు..విశ్వసుందరి పోటీదారులు

- Advertisement -

– పోచంపల్లికి ఒక బృందం..
– యాదగిరిగుట్టకు మరో బృందం
నవతెలంగాణ-భువనగిరి

విశ్వసుందరీ పోటీల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక స్థలాలను గుర్తించి విస్తత ప్రచారం చేయడానికి పూనుకుంది. అందులో భాగంగానే ఆధ్యాత్మికం పర్యాటక కేంద్రమైన యాదగిరిగుట్టను, బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోచంపల్లిని ముస్తాబు చేస్తున్నారు. ప్రపంచంలోని విశ్వసుందరి కిరీటం కోసం తెలంగాణకు వచ్చిన సుందరీమణులు ఈ ప్రాంతాన్ని గురువారం (నేడు) సందర్శించనున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ భారీ ఏర్పాట్లలో నిమగమైంది. సుందరీమణులు రెండు బృందాలుగా విడిపోయి యాదగిరిగుట్టను ఒక బృందం, పోచంపల్లి మరో బృందం పర్యటించనుంది. రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్టలో అత్యంత ఆధ్యాత్మిక శోభను ఉట్టిపడే విధంగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తున్నారు. పోచంపల్లిలో చేనేత వస్త్రాలతో స్వాగత తోరణాలు చేస్తూ రాష్ట్రంలోని పోచంపల్లి, గద్వాల, గొల్లభామ, నారాయణపేట తదితర చేనేత వస్త్రాలను ప్రదర్శనకు పెట్టనున్నారు. సుమారు 120 దేశాల నుంచి వస్తున్న ఈ వనితలకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు రాచకొండ కమిషనరేట్‌ పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -