నవతెలంగాణ – హైదరాబాద్: మిస్ వరల్డ్ 2025 పోటీల ఫైనల్స్ హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న ఈ అందాల పోటీలు బాలీవుడ్ తారల ప్రత్యేక ప్రదర్శనలతో మరింత శోభను సంతరించుకున్నాయి. ఈ ప్రతిష్ఠాత్మక కిరీటం కోసం ప్రపంచవ్యాప్తంగా 108 దేశాలకు చెందిన అందాల భామలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ పోటీల్లో భాగంగా ఇప్పటికే పలు దశల్లో తమ ప్రతిభను చాటుకున్న అందగత్తెల నుంచి 16 మంది క్వార్టర్స్ ఫైనల్స్కు చేరుకున్నారు. వీరి నుంచి చివరి రౌండ్లో నలుగురిని ఎంపిక చేయనున్నారు. అమెరికా-కరేబియన్, ఆఫ్రికా, యూరప్, ఆసియా-ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఈ నలుగురు ఫైనలిస్టులుగా నిలుస్తారు. ఈ నలుగురికి అడిగే చివరి ప్రశ్న, దానికి వారు ఇచ్చే సమాధానం ఆధారంగా న్యాయనిర్ణేతలు మిస్ వరల్డ్ 2025 విజేతను ప్రకటించనున్నారు. ఈ ఫైనల్ పోటీలకు న్యాయనిర్ణేతల బృందంలో ప్రముఖ నటుడు సోనూ సూద్, వ్యాపారవేత్త సుధారెడ్డి, 2014 మిస్ ఇంగ్లండ్ కెరీనా ఉన్నారు. మిస్ వరల్డ్ సంస్థ ఛైర్మన్ జూలియా మోర్లీ ఈ న్యాయనిర్ణేతల ప్యానెల్కు హెడ్గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ నటుడు దగ్గుబాటి రానా, నటి నమ్రత హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అంగరంగ వైభవంగా మిస్ వరల్డ్ – 2025 పోటీలు ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES