- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: థాయ్ జెండా కలిగిన కార్గో నౌకపై హోర్ముజ్ జలసంధి సమీపంలో క్షిపణి దాడి జరిగింది. మయూరీ నారీ అనే ఆ థాయ్ నౌక ఇరాన్కు సమీపంలో ప్రయాణిస్తున్న సమయంలో ఆ నౌక వెనుక భాగం నుండి దాడికి గురైందని రాయల్ థాయ్ నేవీ తెలిపింది. ఈ నౌక యూఏఈలోని ఖలీఫా పోర్ట్ నుంచి కాండ్లా పోర్టుకు బయలుదేరిందని, హోర్ముజ్ వద్ద దాడికి గురి కావడంతో నౌక నుంచి దట్టమైన పొగలు వచ్చాయని వెల్లడించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కూడా విడుదల చేసింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -



