- Advertisement -
విరిగి పడిన చెట్టు కొమ్మ
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
ఆదిలాబాద్ జిల్లాలో మంత్రుల పర్యటనలో ప్రమాదం తప్పింది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, గడ్డం వివేక్ వెంకట్స్వామి గురువారం జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక గాంధీ పార్క్లో గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో పక్కనే ఉన్న ఓ చెట్టు కొమ్మ విరిగి కింద పడింది. దీంతో అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. అయితే, చెట్టు కొమ్మ పడిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం మంత్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
- Advertisement -