- Advertisement -
నవతెలంగాణ -పరకాల : ఎంజెపి గురుకులాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్సిఓకి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగింది. గురువారం జరిగిన ఈ కార్యక్రమానుద్దేశించి హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ .. హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి బీసీ హాస్టల్స్, కాలేజీ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అద్దె భవనంలో ఉంటున్నటి విద్యార్థులకు వాటర్, బాత్రూం సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అద్దె భవనంలో కొనసాగుతున్న హాస్టల్ కు సొంతభవనాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు మడికొండ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -