Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పలువురికి ఎల్ఓసి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

పలువురికి ఎల్ఓసి పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
వేల్పూర్ మండల కేంద్రంలోని తన స్వగృహంలో రాష్ట్ర మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంతి రెడ్డి మంగళవారం పలువురికి ఎల్ఓసి మంజూరు పత్రాలను అందజేశారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ చికిత్స కొరకు నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ముగ్గురికి ఎల్ఓసి పత్రాలను ఆయన అందించారు.

 భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన సయ్యద్ పీర్ అహ్మద్ కు రూ.2లక్షలు, కారేపల్లి గ్రామానికి చెందిన బాదవత్ షీలా కు రూ.2లక్షలు, మెండోరా మండలం దూదిగాం గ్రామానికి చెందిన రాజ్ బి కి రూ.ఒక లక్ష 20వేల ఎల్ఓసి మంజూరు  పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు ఆయన అందించారు చికిత్స కొరకు ఎల్ఓసి మంజూరు చేయించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad