- Advertisement -
నవతెలంగాణ – ఆత్మకూరు
ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలోని వందల సంవత్సరాల పూరతన కోట గుళ్లు శివాలయంలో ఆదివారం ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు రావాలని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య,డిసిసి అధ్యక్షులు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, లకు గ్రామ సర్పంచ్ షబానాగఫూర్ ఆధ్వర్యంలో శివాలయ కమిటీ సభ్యులు గురువారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శివాలయ కమిటీ చైర్మన్ మత్తె వెంకటేష్, సభ్యులు బుక్యా రమేష్, కంది బిక్షపతి, ఒన్నాల ప్రసాంత్, తదితరులు పాల్గొని ఎమ్మెల్యేను స్వాగతించారు.
- Advertisement -



