నవతెలంగాణ – భువనగిరి
నియోజకవర్గంలో నెలకొన్న రహదారుల రహదారులు బ్రిడ్జిల్లా సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆర్ అండ్ బి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరుతూ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సోమవారం హైదరాబాదులో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలూరు – రుద్రవెల్లి హైలెవల్ బ్రిడ్జి గత 12ఏల్లుగా పెండింగ్ లో ఉందన్నారు. పాత కాంట్రాక్టర్ కు టెండర్ రద్దు చేసి కొత్త ఏజెన్సీ ద్వారా నిధులు కేటాయించి పనులు ప్రారంబించాలని కోరారు. భువనగిరి – చిట్యాల రోడ్డు ప్రస్తుతం నేషనల్ హైవే లో ఉన్నదన్నారు. ఈ రోడ్డును ఆర్&బీ రోడ్డుకు బదిలీ చేయాలన్నారు. హెచ్ ఏ ఎం పథకం కింద నాలుగు లైన్లు రోడ్డుగా విస్తరించి పనులు వేగవంతం చేయాలని కోరారు . మూసీ నదిపై ఉన్న బోల్లెపల్లి- సంగెం బ్రిడ్జి నిర్మాణానికి టెండర్ పిలిచి పనులు త్వరితగతిన ప్రారంబించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే తో పాటు ఆర్ అండ్ బి ఈ ఎన్సి మోహన్ నాయక్ పాల్గోన్నారు.
మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే కుంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES