Saturday, June 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

ఆత్మీయులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి : మండలంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన  పలువురు ఆత్మీయులను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం పరామర్శించారు. మండల కేంద్రంలో  ఆంధ్రజ్యోతి రిపోర్టర్, ఆత్మీయులు హఫీజ్ ఖాన్ సతీమణి బేగం ఇటీవల గుండెపోటుతో  మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన హఫీజ్ ఇంటికి వెళ్లి వారిని, వారి కుమారుడు అమేర్ ను పరామర్శించారు. బేగ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులకు వ్యక్తం చేశారు. హఫీజ్, అమేర్ ఓదార్చి ధైర్యాన్ని కల్పించారు.కమ్మర్ పల్లిలో  సీనియర్ నాయకుడు పన్నాల గంగారెడ్డి  తల్లీ  కాలం చేయడంతో వారిని, కుటుంబ సభ్యులను పరామర్శించారు.అమీర్ నగర్ తాజా మాజీ సర్పంచ్ పుప్పాల గంగాధర్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.

గంగాధర్ ను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.ఉప్లూర్ లో గ్రామానికి చెందిన బిఆర్ఎస్  నాయకులు మాసం రాజేశ్వర్ గౌడ్ కాలికి గాయం కావడంతో వారిని పరామర్శించారు. గ్రామానికి చెందిన లెక్చరర్ సాయన్న భార్య భారతి బ్రైన్ స్ట్రోక్ తో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు. గ్రామానికే చెందిన కొత్తపల్లి గణేష్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రేగుంట దేవేందర్, రాష్ట్ర నాయకులు బద్దం చిన్నారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మైలారం సుధాకర్, పిప్పెర అనిల్, నాయకులు బద్దం రాజేశ్వర్, ఏనుగు గంగారెడ్డి, అవారి మురళి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -